BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

పుట్రేల మారెమ్మ తల్లి దేవస్థాన ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 02:44 PM
66 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలోని మారెమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అర్చకులు, దేవస్థాన అధికారులు, గ్రామ పెద్దలు, భక్తులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే, గ్రామ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణకు కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఆలయ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పునః ప్రతిష్ట మహోత్సవం గ్రామానికి ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకువస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ తెర్ల శ్రీనివాసరావు, టీడీపీ విస్సన్నపేట మండల అధ్యక్షుడు రాయల సుబ్బారావు, యువ నాయకులు ఎన్‌ఆర్‌ఐ గిరి, జి.వి.ఆర్., కూటమి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.