BREAKING
వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

పుట్రేల మారెమ్మ తల్లి దేవస్థాన ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 02:44 PM
27 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలోని మారెమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అర్చకులు, దేవస్థాన అధికారులు, గ్రామ పెద్దలు, భక్తులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే, గ్రామ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణకు కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఆలయ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పునః ప్రతిష్ట మహోత్సవం గ్రామానికి ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకువస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ తెర్ల శ్రీనివాసరావు, టీడీపీ విస్సన్నపేట మండల అధ్యక్షుడు రాయల సుబ్బారావు, యువ నాయకులు ఎన్‌ఆర్‌ఐ గిరి, జి.వి.ఆర్., కూటమి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.