పుట్రేల మారెమ్మ తల్లి దేవస్థాన ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలోని మారెమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అర్చకులు, దేవస్థాన అధికారులు, గ్రామ పెద్దలు, భక్తులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే, గ్రామ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణకు కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఆలయ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పునః ప్రతిష్ట మహోత్సవం గ్రామానికి ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకువస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ తెర్ల శ్రీనివాసరావు, టీడీపీ విస్సన్నపేట మండల అధ్యక్షుడు రాయల సుబ్బారావు, యువ నాయకులు ఎన్ఆర్ఐ గిరి, జి.వి.ఆర్., కూటమి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.