పుట్రేలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
పుట్రేలలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం
పుట్రేల: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలో మంగళవారం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పంటల సాగు, వ్యవసాయ పద్ధతులు, చీడపీడల నివారణ, ఎరువుల వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు.
మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మి, వ్యవసాయ విస్తరణ అధికారి ఉషారాణి రైతులతో మాట్లాడి ప్రస్తుతం సాగులో ఉన్న పంటల పరిస్థితిని పరిశీలించారు. పంటలలో వచ్చే సమస్యలను ముందుగానే గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యవసాయ శాఖ అందిస్తున్న సేవలు, రైతులకు అందుబాటులో ఉన్న సాంకేతిక సూచనలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది శరత్, జమల రావు, సహకార సంఘం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.