www.ntodaynews.com
పుట్రేలలో ఉషోదయ భూముల సర్వే చేపట్టిన అధికారులు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం పుట్రెల గ్రామంలో గత కొద్ది నెలలుగా ఉషోదయ భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని లబ్ధిదారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారు విస్సన్నపేట మండల తహసీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణికి వినతిపత్రం అందజేశారు.
లబ్ధిదారుల ఫిర్యాదుపై స్పందించిన మండల అధికారులు ఈరోజు (గురువారం) ఉషోదయ భూముల్లో సర్వే నిర్వహించారు. భూముల బౌండరీలను గుర్తించి, లబ్ధిదారులకు సంబంధించిన వివరాలను మూడు నుంచి నాలుగు రోజుల్లో తెలియజేస్తామని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వి. నాగరాజు, ఉషోదయ భూముల లబ్ధిదారులు పాల్గొన్నారు.