పుట్టపర్తిలో భారీ రక్షణ ప్రాజెక్టులకు నేడు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్లో రక్షణ రంగానికి కొత్త దిశగా భావిస్తున్న కీలక కార్యక్రమం నేడు పుట్టపర్తిలో జరగనుంది. మరికాసేపట్లో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఐదో తరం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) తయారీ కేంద్రానికి శంకుస్థాపన కానుంది. ఈ మహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు.
దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా పుట్టపర్తి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందనుంది. ఏఎంసీఏ ఇంటిగ్రేషన్ మరియు ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్తో పాటు, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మరికొన్ని కీలక రక్షణ రంగ ప్రాజెక్టులకు కూడా ఈ సందర్భంగా శంకుస్థాపన జరగనుంది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననుండగా, రాష్ట్రంలో రక్షణ మరియు ఏరోస్పేస్ రంగాలకు ఇది గేమ్చేంజర్గా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడులతో పాటు యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.