పుట్టపర్తిలో మంత్రి లోకేష్ పర్యటన.. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక దర్శనం
శ్రీ సత్యసాయి జిల్లాలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఉదయం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్కు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకులు స్వాగతం పలికారు.
అనంతరం సాయి కుల్వంత్ మందిరంలోని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని మంత్రి లోకేష్ దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ స్టేట్ మీడియా కోఆర్డినేట్ మరియు రాష్ట్ర కార్యదర్శి బి.వి రాముడు తదితరులు పాల్గొన్నారు.
కాసేపట్లో పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఐదో తరం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) తయారీ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొననున్నారు.
ఏఎంసీఏ ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీతో పాటు ఇతర రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు.