BREAKING
thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
Date of Publish : 02 September 2025, 10:31 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

గ్రామ సచివాలయ ఉద్యోగుల నిర్వాకం వలన తీవ్ర ఇబ్బందులకు గురైన పెన్షన్ దారులు.

తెలంగాణ
02 Sep, 2025 - 10:31 PM
414 వీక్షణలు
గ్రామ సచివాలయ ఉద్యోగుల నిర్వాకం వలన తీవ్ర ఇబ్బందులకు గురైన పెన్షన్ దారులు. NTODAY NEWS: జగ్గయ్యపేట రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ లో కొంతమంది అనర్హులు కూడా ఉండటంతో రి వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పెనుగంచిప్రోలు గ్రామంలోని కొంతమంది పెన్షన్ దారులకు గత మార్చి, ఏప్రిల్ నెలలో నోటీసులు ఇచ్చి జగ్గయ్యపేటలో వెరిఫికేషన్ నిర్వహించారు. అలాగే ఈ నెలలో కూడా మరి కొంతమందిని రీ వెరిఫికేషన్ చేసే ఉద్దేశంతో నోటీసులు జారీ చేయాలని గ్రామ సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వచ్చాయి. ఈ నోటీసులు కూడా ఆయా పెన్షన్ దారుల ఇంటికి వెళ్లి అందజేయాలని ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ పెనుగంచిప్రోలలోని సచివాలయ సిబ్బంది నోటీసులు అందుకునే పెన్షన్ దారులకు ఈ నెల పెన్షన్ ఇవ్వకుండా ఈనెల పెన్షన్ జాబితాలో మీ పేరు లేదని మీరు గ్రామ సచివాలయానికి వెళ్లి అధికారులు సంప్రదించాలని వారు తెలిపారు. దీంతో తమ పెన్షన్ ఆగిపోయిందేమోనని, అలాగే నడవలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులను, వికలాంగులను గ్రామ సచివాలయాన్ని వద్దకు ఎలా తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎలాగో కష్టపడి సచివాలయం దగ్గరకు వెళ్లిన పెన్షన్ దారులకు ఈ నెల పెన్షన్ ను అందజేసి ఈనెల నాలుగవ తేదీన జగ్గయ్యపేటలో రి వెరిఫికేషన్ జరుగుతుందని అక్కడికి వెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవాలని నోటీసులు జరీ చేశారు. అసలు పెన్షన్ దారులు ఇంటి వద్దకు వెళ్లి నోటీసులు జారీ చేయవలసిన అధికారులు గ్రామ సచివాలయాన్ని పిలిపించుకొని నోటీసులు ఇవ్వటం ఏమిటని పలువురు పెన్షన్ దారుల ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. Follow us on Website Facebook Instagram YouTube