BREAKING
అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి
www.ntodaynews.com

గ్రామ సచివాలయ ఉద్యోగుల నిర్వాకం వలన తీవ్ర ఇబ్బందులకు గురైన పెన్షన్ దారులు.

తెలంగాణ
02 Sep, 2025 - 10:31 PM
373 వీక్షణలు
గ్రామ సచివాలయ ఉద్యోగుల నిర్వాకం వలన తీవ్ర ఇబ్బందులకు గురైన పెన్షన్ దారులు. NTODAY NEWS: జగ్గయ్యపేట రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ లో కొంతమంది అనర్హులు కూడా ఉండటంతో రి వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పెనుగంచిప్రోలు గ్రామంలోని కొంతమంది పెన్షన్ దారులకు గత మార్చి, ఏప్రిల్ నెలలో నోటీసులు ఇచ్చి జగ్గయ్యపేటలో వెరిఫికేషన్ నిర్వహించారు. అలాగే ఈ నెలలో కూడా మరి కొంతమందిని రీ వెరిఫికేషన్ చేసే ఉద్దేశంతో నోటీసులు జారీ చేయాలని గ్రామ సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వచ్చాయి. ఈ నోటీసులు కూడా ఆయా పెన్షన్ దారుల ఇంటికి వెళ్లి అందజేయాలని ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ పెనుగంచిప్రోలలోని సచివాలయ సిబ్బంది నోటీసులు అందుకునే పెన్షన్ దారులకు ఈ నెల పెన్షన్ ఇవ్వకుండా ఈనెల పెన్షన్ జాబితాలో మీ పేరు లేదని మీరు గ్రామ సచివాలయానికి వెళ్లి అధికారులు సంప్రదించాలని వారు తెలిపారు. దీంతో తమ పెన్షన్ ఆగిపోయిందేమోనని, అలాగే నడవలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులను, వికలాంగులను గ్రామ సచివాలయాన్ని వద్దకు ఎలా తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎలాగో కష్టపడి సచివాలయం దగ్గరకు వెళ్లిన పెన్షన్ దారులకు ఈ నెల పెన్షన్ ను అందజేసి ఈనెల నాలుగవ తేదీన జగ్గయ్యపేటలో రి వెరిఫికేషన్ జరుగుతుందని అక్కడికి వెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవాలని నోటీసులు జరీ చేశారు. అసలు పెన్షన్ దారులు ఇంటి వద్దకు వెళ్లి నోటీసులు జారీ చేయవలసిన అధికారులు గ్రామ సచివాలయాన్ని పిలిపించుకొని నోటీసులు ఇవ్వటం ఏమిటని పలువురు పెన్షన్ దారుల ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. Follow us on Website Facebook Instagram YouTube