BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ

తెలంగాణ
31 Jan, 2026 - 04:25 AM
348 వీక్షణలు
చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద ఇంటింటికీ పంపిణీ NTODAY NEWS: ఏలూరు జిల్లా, కామవరపుకోట మండలం ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ–విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు, ఆదివారం ఒకటో తేదీ కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టారు. తెల్లవారుజామునే చింతలపూడి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ, “చంద్రన్న మీ ఇంటికి నన్ను పంపారు. ఒక రోజు ముందుగానే పింఛన్ అందించి ప్రతి ఇంట్లో చిరునవ్వు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం” అని లబ్ధిదారులతో పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీన పింఛన్లు అందిస్తున్నది కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో చింతలపూడి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరవుతున్నాయని తెలిపారు. మౌలిక వసతుల కల్పన, ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు, తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నామని, గ్రామగ్రామాన అభివృద్ధి పరుగులు తీస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, మండల పార్టీ అధ్యక్షుడు కిలారి సత్యనారాయణ, గ్రామ టీడీపీ–కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. #NTRBharosa #PensionDistribution #Chintalapudi #EluruDistrict #AllianceGovernment #SocialSecurityPensions #DoorstepDelivery #PublicWelfare Follow us on Website Facebook Instagram YouTube