BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ

తెలంగాణ
31 Jan, 2026 - 04:25 AM
298 వీక్షణలు
చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద ఇంటింటికీ పంపిణీ NTODAY NEWS: ఏలూరు జిల్లా, కామవరపుకోట మండలం ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ–విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు, ఆదివారం ఒకటో తేదీ కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టారు. తెల్లవారుజామునే చింతలపూడి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ, “చంద్రన్న మీ ఇంటికి నన్ను పంపారు. ఒక రోజు ముందుగానే పింఛన్ అందించి ప్రతి ఇంట్లో చిరునవ్వు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం” అని లబ్ధిదారులతో పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీన పింఛన్లు అందిస్తున్నది కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో చింతలపూడి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరవుతున్నాయని తెలిపారు. మౌలిక వసతుల కల్పన, ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు, తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నామని, గ్రామగ్రామాన అభివృద్ధి పరుగులు తీస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, మండల పార్టీ అధ్యక్షుడు కిలారి సత్యనారాయణ, గ్రామ టీడీపీ–కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. #NTRBharosa #PensionDistribution #Chintalapudi #EluruDistrict #AllianceGovernment #SocialSecurityPensions #DoorstepDelivery #PublicWelfare Follow us on Website Facebook Instagram YouTube