www.ntodaynews.com
ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ
తెలంగాణ
చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ
ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద ఇంటింటికీ పంపిణీ
NTODAY NEWS: ఏలూరు జిల్లా, కామవరపుకోట మండలం
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ–విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు, ఆదివారం ఒకటో తేదీ కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టారు. తెల్లవారుజామునే చింతలపూడి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ, “చంద్రన్న మీ ఇంటికి నన్ను పంపారు. ఒక రోజు ముందుగానే పింఛన్ అందించి ప్రతి ఇంట్లో చిరునవ్వు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం” అని లబ్ధిదారులతో పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీన పింఛన్లు అందిస్తున్నది కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో చింతలపూడి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరవుతున్నాయని తెలిపారు. మౌలిక వసతుల కల్పన, ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు, తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నామని, గ్రామగ్రామాన అభివృద్ధి పరుగులు తీస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, మండల పార్టీ అధ్యక్షుడు కిలారి సత్యనారాయణ, గ్రామ టీడీపీ–కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
#NTRBharosa
#PensionDistribution
#Chintalapudi
#EluruDistrict
#AllianceGovernment
#SocialSecurityPensions
#DoorstepDelivery
#PublicWelfare
Follow us on
Website
Facebook
Instagram
YouTube