www.ntodaynews.com
ఫడ్నవీస్ అపాయింట్మెంట్పై రాజకీయ రచ్చ..!
జాతీయం
ఫడ్నవీస్ అపాయింట్మెంట్పై రాజకీయ రచ్చ..!
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అంశంపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని రెండు రోజులుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తుండగా, మరోవైపు అదే ఫడ్నవీస్ను ఈరోజు కలిసి పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు నారా లోకేష్ వెల్లడించారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఫడ్నవీస్ నిజంగా అపాయింట్మెంట్ ఇవ్వలేదా? లేక రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు రాజకీయ విమర్శల కోసమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే నారా లోకేష్కు లభించిన అవకాశం రేవంత్ రెడ్డికి ఎందుకు దక్కలేదన్న అంశంపైనా రాజకీయ వాదోపవాదాలు సాగుతున్నాయి.