BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​ఫిట్‌నెస్ లేని విద్యాసంస్థల బస్సులను సీజ్ చేస్తాం: మంచిర్యాల డీటీఓ గోపికృష్ణ హెచ్చరిక

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
27 May, 2026 - 11:43 AM
98 వీక్షణలు

మంచిర్యాల జిల్లాలో రవాణా అర్హత పత్రం (ఫిట్‌నెస్) లేని విద్యాసంస్థల బస్సులను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని జప్తు (సీజ్) చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి గోపికృష్ణ స్పష్టం చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల బస్సుల సామర్థ్య తనిఖీలను ముమ్మరం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలకు చెందిన మొత్తం 373 బస్సులు ఉన్నాయని తెలిపారు. అందులో ఇప్పటివరకు 110 బస్సులకు తనిఖీలు పూర్తి చేసి అర్హత పత్రాలు అందజేసినట్లు ఆయన వెల్లడించారు.

​ప్రతిరోజూ 30 బస్సుల పరిశీలన

​విద్యార్థుల భద్రతే ధ్యేయంగా రవాణా శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రతిరోజూ 30 బస్సులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. బడులు తెరిచే లోపు జిల్లాలోని ప్రతి విద్యాసంస్థ తమ వాహనాలకు తప్పనిసరిగా రవాణా శాఖ పరీక్షలు చేయించుకుని, నిబంధనల ప్రకారం అర్హత పత్రం పొందాలని ఆదేశించారు.

​చట్టాన్ని అతిక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి తెచ్చే వాహనాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ తనిఖీ కార్యక్రమాల్లో జిల్లా రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు