BREAKING
సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం
www.ntodaynews.com

​ఫిట్‌నెస్ లేని విద్యాసంస్థల బస్సులను సీజ్ చేస్తాం: మంచిర్యాల డీటీఓ గోపికృష్ణ హెచ్చరిక

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
27 May, 2026 - 11:43 AM
62 వీక్షణలు

మంచిర్యాల జిల్లాలో రవాణా అర్హత పత్రం (ఫిట్‌నెస్) లేని విద్యాసంస్థల బస్సులను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని జప్తు (సీజ్) చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి గోపికృష్ణ స్పష్టం చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల బస్సుల సామర్థ్య తనిఖీలను ముమ్మరం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలకు చెందిన మొత్తం 373 బస్సులు ఉన్నాయని తెలిపారు. అందులో ఇప్పటివరకు 110 బస్సులకు తనిఖీలు పూర్తి చేసి అర్హత పత్రాలు అందజేసినట్లు ఆయన వెల్లడించారు.

​ప్రతిరోజూ 30 బస్సుల పరిశీలన

​విద్యార్థుల భద్రతే ధ్యేయంగా రవాణా శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రతిరోజూ 30 బస్సులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. బడులు తెరిచే లోపు జిల్లాలోని ప్రతి విద్యాసంస్థ తమ వాహనాలకు తప్పనిసరిగా రవాణా శాఖ పరీక్షలు చేయించుకుని, నిబంధనల ప్రకారం అర్హత పత్రం పొందాలని ఆదేశించారు.

​చట్టాన్ని అతిక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి తెచ్చే వాహనాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ తనిఖీ కార్యక్రమాల్లో జిల్లా రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు