www.ntodaynews.com
ఫ్యూచర్ సిటీని రద్దు చేసే ప్రసక్తే లేదు
తెలంగాణ
/
హైదరాబాద్
ఫ్యూచర్ సిటీని రద్దు చేసే ప్రసక్తే లేదు: స్పష్టం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలంగాణలో రేపటి నుంచి భూముల మార్కెట్ విలువలు 50 నుంచి 100 శాతం పెంచుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పెంపుతో ప్రభుత్వానికి రూ.1,400 కోట్ల ఆదాయం సమకూరుతుందని, ముఖ్యంగా శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఖాజాగూడ వంటి ప్రాంతాల్లో అధిక పెంపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే ఆలోచన లేదని, ఫ్యూచర్ సిటీని రద్దు చేసే అవకాశమే లేదని, త్వరలో తహసీల్దార్ల బదిలీలు ఉంటాయని మంత్రి తెలిపారు.