BREAKING
వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

PM స్వనిధి పథకంతో స్వయం ఉపాధికి బాటలు.. అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 07:17 PM
13 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ప్రధానమంత్రి స్వనిధి (PM SVANidhi) పథకం విజయవంతంగా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PM స్వనిధి పథకం వీధి వ్యాపారులకు సులభ రుణాలు అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోందన్నారు. చిన్న వ్యాపారులు ఆత్మనిర్భరంగా ఎదగడానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని తెలిపారు.

కూలీ పని చేస్తే ఒక రోజు, ఉద్యోగం చేస్తే ఒక నెల జీవనం సాగుతుందని, అయితే వ్యాపారం చేస్తే జీవితాంతం కుటుంబానికి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వ్యాపారం ద్వారా పిల్లల ఉన్నత విద్య, కుటుంబ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. స్వయం ఉపాధి రంగంలోకి వచ్చి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న రుణాలను అనవసర ఖర్చులకు వినియోగించకుండా ఆదాయాన్ని పెంచే వ్యాపారాల కోసం ఉపయోగించాలని పిలుపునిచ్చారు. టీ షాపులు, టిఫిన్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, పాడి పరిశ్రమలు వంటి చిన్న వ్యాపారాలను ప్రారంభించి వాటిని క్రమంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ రుణ పథకాల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడంతో పాటు భవిష్యత్ తరాలకు కూడా బలమైన ఆర్థిక భద్రత కల్పించాలని కోరారు. వీధి వ్యాపారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతూ తమ జీవనోపాధిని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు.

పథకం అమలులో విశేషంగా కృషి చేస్తున్న అధికారులను అభినందించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ సేవలు మరియు సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో మెప్మా అధికారులు, పథకం లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.