www.ntodaynews.com
ప్రజాక్షేత్రంలో కుమ్మర్లు రాజకీయంగా చైతన్యం కావాలి
తెలంగాణ
ప్రజాక్షేత్రంలో కుమ్మర్లు రాజకీయంగా చైతన్యం కావాలి-- బేతాళ శ్రీనివాసులు
NTODAY NEWS: బొమ్మలరామారం
తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల జనాభా ఉన్న కుమ్మర్లకు నేటికీ చట్టసభలలో ప్రాతినిధ్యం లేకపోవడం కుమ్మర్లు ఆర్థికంగా రాజకీయంగా చైతన్యం లేకపోవడమే కారణమని బొమ్మలరామారం మండల కుమ్మరి సంఘం అధ్యక్షులు బేతాళ శ్రీనివాసులు అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని పోచమ్మ దేవాలయ ప్రాంగణంలో జరిగిన కుమ్మర్ల విస్తృత మండల స్థాయి సమావేశంలో మండల శాఖ అధ్యక్షుడిగా బేతాళ శ్రీనివాసులును ప్రధాన కార్యదర్శిగా బేతాళ బాలరాజు తోపాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బొమ్మలరామారం మండలంలోని అన్ని గ్రామాల నుంచి హాజరైన కుమ్మరి సోదరులు భవిష్యత్తులో కుమ్మరులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించి చట్టసభలలో అవకాశం కల్పించే పార్టీకే కుమ్మరులంతా ఐక్యంగా నిలవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు అనంతరం జరిగిన సమావేశంలో బేతాళ శ్రీనివాసులు మాట్లాడుతూ కుమ్మరి సోదరుల సహకారంతో మండల కేంద్రంలో కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు రామాయణాన్ని తెలుగులో అనువదించిన కుమ్మర్ల ఆడపడుచు కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని 14 లక్షల జనాభా ఉన్న కుమ్మరలకు ఎమ్మెల్సీ అవకాశాన్ని కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కుమ్మరి సంఘం రాష్ట్ర ఆదేశాల మేరకు జరిగిన ఈ ఎన్నిక కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ ఓరుగంటి గోపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు తాడూరి ఆంజనేయులు, చిన్నగారి బలరాం, దొమ్మాట మల్లేష్, తాడూరి లక్ష్మణ్ తో పాటు బొమ్మలరామారం మండల గౌరవ సభ్యులు బోనంకుర మల్లేశం, బేతాళ బాలనరసింహ, బేతాళ బాలరాజ్, బేతాళ లక్ష్మణ్, దొమ్మాట శంకర్, నెల్లుట్ల రవీందర్, బేతాళ పాండు, బేతాళ కుమార్, అన్నారం గణేష్, మండల శాఖ ఉపాధ్యక్షులు అన్నారం చంద్రశేఖర్, బేతాళ జనార్ధన్, సహాయ కార్యదర్శి నెల్లుట్ల శివకుమార్, కోర్రెపల్లి రామ్, మల్లేష్, కోశాధికారి బేతాళ రాములు, ప్రచార కార్యదర్శి నెల్లుట్ల వెంకటేష్, బేతాళ చంద్రమౌళి పాల్గొన్నారు
Follow us on
Website
Facebook
Instagram
YouTube