BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్రవేత్త మృతి

తెలంగాణ
04 Jan, 2026 - 09:33 AM
324 వీక్షణలు

ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ముప్పా నరసింహ రెడ్డి మృతి

-నరసింహ రెడ్డికి ప్రముఖుల నివాళి NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ముప్పా నరసింహ రెడ్డి ఆదివారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన 1941లో చిట్యాల పట్టణంలో జన్మించారు. అంకితభావం, సహనశక్తి, వినయానికి ప్రతిరూపంగా నిలిచిన నరసింహ రెడ్డి విద్యావేత్తగా, భూవిజ్ఞాన శాస్త్రవేత్తగా విశేష గుర్తింపు పొందారు. ఉన్నత విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అభ్యసించిన ఆయన, అక్కడే మూడు దశాబ్దాలకు పైగా సేవలందించారు. లెక్చరర్‌, రీడర్‌గా పనిచేసి, అనంతరం భూవిజ్ఞాన విభాగంలో ప్రొఫెసర్‌గా (1990–2001) విధులు నిర్వర్తించారు. విభాగాధిపతిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 1989లో నిర్వహించిన 8వ భారతీయ అంతార్కిటికా శాస్త్రయాత్రలో భారతీయ విశ్వవిద్యాలయాల తరఫున ఏకైక ప్రతినిధిగా పాల్గొని విశేష ప్రశంసా పత్రం అందుకున్నారు. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఛైర్మన్‌గా, అలాగే ఢిల్లీ ఐఐటీ గవర్నింగ్ బాడీ సభ్యుడిగా సేవలందించి విద్యారంగానికి విశేష గౌరవం తీసుకొచ్చారు. ఆదివారం ఆయన పార్ధివ దేహానికి మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం, శాసనమండలి సభ్యుడు చెరుపల్లి సీతారాములు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు నివాళులు అర్పించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు ముప్పా నరసింహ రెడ్డి భారతదేశ భూవిజ్ఞాన శాస్త్రానికి అందించిన సేవలు అమూల్యమైనవని, ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. విద్యారంగంతో పాటు మానవత్వం, జ్ఞానం, అంకితభావం వంటి లక్షణాలతో ఆయన లేకపోవడం తీరని లోటుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్‌లు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube