BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

రాహుల్ గాంధీ ప్రసంగంపై కాంగ్రెస్ స్పందన.. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:45 PM
15 వీక్షణలు

ఏలూరు, జూన్ 26: జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజస్థాన్‌లోని కోటలో జరిగిన "ఛత్రోంకే గూంజ్" కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై విమర్శలు వ్యక్తం చేశారు.

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు మాట్లాడుతూ, NEET, SSC, APPSC, DSC వంటి పోటీ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడుతోందని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో లోపాల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం వల్ల నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోందని, కోటలో జరిగిన ర్యాలీకి యువత భారీగా హాజరుకావడం దీనికి నిదర్శనమని అన్నారు.

రాష్ట్రంలో కూడా నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చిందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతాప్ సుబ్రహ్మణ్య శర్మ, తాళ్లూరి చక్రవర్తి, గౌడు రంగబాబు, చక్కా గుప్తా, పెద్దిరెడ్డి పద్మావతి నాయుడు, దండుబోయిన చంద్రశేఖర్, సాధే బాబుప్రసాద్, సేవాదళ్ సుబ్బారావు, కేఎస్‌ఎన్ మూర్తి, చినబాబు, రాటాలు సూర్యనారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.