www.ntodaynews.com
రాజంపేట: బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు.. గంటల తరబడి నిరీక్షణ
ఆంధ్రప్రదేశ్
/
వైఎస్ఆర్ కడప
రాజంపేట: బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు.. గంటల తరబడి నిరీక్షణ
వైయస్సార్ కడప జిల్లా రాజంపేట పాత బస్టాండ్లో ఆర్టీసీ బస్సుల రాకపోకలు సక్రమంగా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు సర్వీసుల కోసం గంటకు పైగా వేచి చూడాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బస్సుల కోసం ఎదురుచూస్తున్న వారిలో మహిళలు, వృద్ధులు, చిన్నారులతో వచ్చిన వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిర్ణీత సమయాలకు బస్సులు రాకపోవడంతో ప్రయాణ ప్రణాళికలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు.
ప్రజా రవాణాలో కీలకమైన ఆర్టీసీ సేవలు మెరుగుపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సుల సమయపాలన పాటించి, అవసరమైన మార్గాల్లో అదనపు సర్వీసులు నడపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.