రాజంపేటలో హిందూ సంఘాల నిరసన..
రాజంపేటలో హిందూ సంఘాల నిరసన.. కాకినాడ ఘటనపై సమగ్ర విచారణకు డిమాండ్
“జాగో హిందూ జాగో” నినాదాలతో ఆందోళన
రాజంపేట: కాకినాడ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజంపేటలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు “జాగో హిందూ జాగో” అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలను వెలికితీసేందుకు పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళలు, కుటుంబాల భద్రతకు ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు. సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు, పలువురు కార్యకర్తలు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.