సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ నిర్లక్ష్యం చేసింది : మంత్రి అచ్చెన్నాయుడు
సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ నిర్లక్ష్యం చేసింది : మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి : రాష్ట్రంలో వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. సాగునీటి రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
హంద్రీనీవా ప్రాజెక్టుపై గత 16 నెలల్లో రూ.3,500 కోట్లు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీరు అందించే చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులు గతంలోనే వేగంగా కొనసాగి ఉంటే ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
వెలిగొండ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.