www.ntodaynews.com
సహచరులతో పోలీసుల ఆత్మీయ రాఖీ బంధం
తెలంగాణ
/
మేడ్చల్-మల్కాజిగిరి
సహచరులతో పోలీసుల ఆత్మీయ రాఖీ బంధం
ఘట్కేసర్: మల్కాజిగిరి సీపీ సుమతి ఆదేశాల మేరకు 'సహచరి’ కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్, పోచారం పీఎస్ పరిధిలో గురువారం రక్షాబంధన్ వేడుకలను ఆత్మీయంగా నిర్వహించారు. డ్వాక్రా మహిళలు సీఐలు బాలస్వామి, జగన్నాథ్ పాటు ఎస్ఐలకు రాఖీలు కట్టి పోలీసులతో తమ అనుబంధాన్ని చాటారు. పోలీసుల భద్రతకు సహచరులుగా నిలుస్తున్న మహిళలు, సమాజ శాంతిభద్రతల్లో భాగస్వాములుగా కొనసాగాలని పోలీసులు ఆకాంక్షించారు. మహిళలకు కానుకలు అందజేశారు.