మంగళగిరి: టీడీపీ కేంద్ర కార్యాలయానికి నేడు సీఎం చంద్రబాబు....
మంగళగిరి: టీడీపీ కేంద్ర కార్యాలయానికి నేడు సీఎం చంద్రబాబు.. సీనియర్ నేతలతో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు (ఆగస్టు 28) మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు.
కార్యాలయానికి చేరుకున్న అనంతరం పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ–ప్రభుత్వ సమన్వయం తదితర కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సమీక్ష చేయడం వంటి అంశాలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
సీఎం పర్యటన సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే పార్టీ కార్యకర్తలు, ప్రజలను కలిసి వారి సమస్యలపై వినతులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.