BREAKING
కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు
www.ntodaynews.com

అమరావతి అభివృద్ధికి రూ.1,400 కోట్లు.. సెంట్రల్ లైబ్రరీకి రూ.596 కోట్లు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 09:24 AM
9 వీక్షణలు

అమరావతి అభివృద్ధికి రూ.1,400 కోట్లు.. సెంట్రల్ లైబ్రరీకి రూ.596 కోట్లు

అమరావతి : సీఆర్‌డీఏ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని ప్రాంతంలోని మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,400 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

శాకమూరులో రూ.596 కోట్ల వ్యయంతో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. చిన్న రహదారుల నిర్మాణంలో సీసీ రోడ్లకు బదులుగా బీటీ రోడ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

రాజధాని ప్రాంతంలో పచ్చదనం, ఇంధన రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఐఓసీఎల్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతిని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.