అమరావతి అభివృద్ధికి రూ.1,400 కోట్లు.. సెంట్రల్ లైబ్రరీకి రూ.596 కోట్లు
అమరావతి అభివృద్ధికి రూ.1,400 కోట్లు.. సెంట్రల్ లైబ్రరీకి రూ.596 కోట్లు
అమరావతి : సీఆర్డీఏ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని ప్రాంతంలోని మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,400 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
శాకమూరులో రూ.596 కోట్ల వ్యయంతో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. చిన్న రహదారుల నిర్మాణంలో సీసీ రోడ్లకు బదులుగా బీటీ రోడ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రాజధాని ప్రాంతంలో పచ్చదనం, ఇంధన రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఐఓసీఎల్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతిని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.