BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీసీవై పార్టీ నాయకులు సత్య ప్రమాణం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 May, 2026 - 09:06 PM
80 వీక్షణలు

రామచంద్ర యాదవ్  పై కొందరు రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న తప్పుడు ఆరోపణలకు సమాధానంగా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం రాజనాల బండలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత వెలసిన ప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీసీవై పార్టీ నాయకులు సత్య ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా బీసీవై పార్టీ నాయకులు మాట్లాడుతూ —

“మా పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్  కానీ, పార్టీ నాయకులు కానీ ఎలాంటి ఇతర రాజకీయ పార్టీలకు తొత్తులు కాదని, బినామీలు కాదని దేవుని సాక్షిగా ప్రమాణం చేశాము. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే చర్య” అని పేర్కొన్నారు.

అలాగే బీసీవై పార్టీకి సవాలు విసిరిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలయానికి వచ్చి ప్రమాణం చేయకపోవడం ప్రజలు గమనించారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో టిడిపి, వైసిపి పార్టీలు పరస్పరం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని ప్రజలకు స్పష్టంగా తెలుసునని అన్నారు.

బీసీల హక్కులు, యువత భవిష్యత్తు, సామాన్య ప్రజల సమస్యలపై రాజీపడకుండా పోరాడేది బీసీవై పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ పీఏసీ కమిటీ సభ్యులు పాల రమేష్ యాదవ్, పూల ప్రేమ్ కుమార్ (బీసీవై యూత్ కో-కన్వీనర్), పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ హరిబాబు యాదవ్, సురేష్ యాదవ్, కుమ్మర గిరిబాబు, శివకుమార్, వెంకటేష్ యాదవ్, చలపతి, రెడ్డివారి మోహన్, స్వాతి యాదవ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.