రాఖీ వేళ స్వీట్లు కొంటున్నారా జాగ్రత్త.
రాఖీ వేళ స్వీట్లు కొంటున్నారా జాగ్రత్త.
TG : రాఖీ పండగకు అన్నాదమ్ముళ్లకు రాఖీ కట్టేందుకు అక్కాచెల్లెళ్లు సొంతూరు బాటపట్టారు. వరుస సెలవులు కలిసిరావడంతో ఉరుకుల పరుగుల జీవితానికి లీవ్ పెట్టి 4రోజులైన ఆనందంగా గడిపేందుకు వెళ్తున్నామని చెబుతున్నారు. ఉదయం నుంచే ఘట్కేసర్, ఉప్పల్, చింతలకుంట, సాగర్ రోడ్డు, ఆరాంఘర్, JBS, MGBS కిటకిటలాడుతున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకొని బస్లు పెంచినప్పటికీ హనుమకొండ రూట్లో సరిపోవడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు.
రాఖీ వేళ మిఠాయిలు కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. వినియోగదారులు వాటి తాజాదనం, నిల్వ పరిస్థితులు, పరిశుభ్రతను తనిఖీ చేయాలి. కొన్ని దుకాణాలు ఐదు లేదా ఆరు రోజుల క్రితం తయారు చేసిన మిఠాయిలను, అవి తాజాగా తయారు చేశారని చెప్పుకుంటూ అమ్ముతుంటారు. ఇలాంటి ఉత్పత్తులను తినడం వల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంటుంది. రుచి లేదా పరిశుభ్రతకు సంబంధించి సందేహాలు ఉంటే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.