BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
14 Apr, 2026 - 11:33 AM
11 వీక్షణలు
రామసముద్రం మండలం లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు. 

​భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్త, విద్యావేత్త మరియు ఆర్థిక నిపుణుడు అయిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని రామసముద్రం మండల దళిత నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాదళిత నాయకులు బి. భాస్కర్, అంబరీష్ నరసింహులు, మెకానిక్ వెంకటేష్, వెంకటరమణ, మంజునాథ, సోమశేఖర్, సుబ్రహ్మణ్యం, గంగాధర్, వి. మంజునాథ్, చంద్రప్ప, పరమేష్,రామాంజులు, చలపతి, కార్యకర్తలు  పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
​ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అంబేద్కర్ అస్సోసియేషన్ అధ్యక్షలు భాస్కర్ మాట్లాడుతూ.. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుంటూ అభివృద్ధి పథంలో సాగాలని పిలుపునిచ్చారు.

​ "అంబేద్కర్ అమర్ రహే" అంటూ చేసిన నినాదాలతో పరిసరాలు మారుమోగాయి.
​ ఎల్లప్పుడూ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ, సమసమాజ స్థాపనకు కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.