BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

రామసముద్రం పీఎస్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 09:12 PM
59 వీక్షణలు

రామసముద్రం పీఎస్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి 

అన్నమయ్య జిల్లా 

మదనపల్లె/రామసముద్రం, జూన్ 04: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని రామసముద్రం పోలీస్ స్టేషన్‌ను గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సందర్శించారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించిన ఆయన, స్థానిక శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మదనపల్లె రూరల్ సీఐ శ్రీ రవినాయక్, రామసముద్రం ఎస్ఐ శ్రీ రిషికేశవ రెడ్డిలతో ప్రత్యేకంగా మాట్లాడి, ఈ ప్రాంతంలో నేరాల తీరుపై ఆరా తీశారు. విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉంటూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, ప్రజలకు మరింత చేరువవ్వాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఎస్పీ గారు సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. సిబ్బంది విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోవడంతో పాటు, నిరంతరం క్రమశిక్షణతో మెలుగుతూ ప్రజలకు జవాబుదారీగా ఉంటూ అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.