BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

రామసముద్రం పీఎస్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 09:12 PM
13 వీక్షణలు

రామసముద్రం పీఎస్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి 

అన్నమయ్య జిల్లా 

మదనపల్లె/రామసముద్రం, జూన్ 04: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని రామసముద్రం పోలీస్ స్టేషన్‌ను గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సందర్శించారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించిన ఆయన, స్థానిక శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మదనపల్లె రూరల్ సీఐ శ్రీ రవినాయక్, రామసముద్రం ఎస్ఐ శ్రీ రిషికేశవ రెడ్డిలతో ప్రత్యేకంగా మాట్లాడి, ఈ ప్రాంతంలో నేరాల తీరుపై ఆరా తీశారు. విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉంటూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, ప్రజలకు మరింత చేరువవ్వాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఎస్పీ గారు సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. సిబ్బంది విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోవడంతో పాటు, నిరంతరం క్రమశిక్షణతో మెలుగుతూ ప్రజలకు జవాబుదారీగా ఉంటూ అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.