BREAKING
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU
www.ntodaynews.com

రాష్ట్ర గీతానికే తొలి ప్రాధాన్యం.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:32 AM
27 వీక్షణలు

తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుగా రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను ఆలపించాల్సిందేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర గీతాన్ని పక్కన పెట్టి ఇతర గీతాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశం కేంద్ర హోం శాఖ సర్క్యులర్‌లో లేదని కోర్టు పేర్కొంది.

చెన్నైకి చెందిన అనన్య రాధాకృష్ణన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను తమిళ రాష్ట్ర గీతంతో ప్రారంభించి, చివరగా జాతీయ గీతంతో ముగించడం తమిళనాడులో చాలా కాలంగా కొనసాగుతున్న సంప్రదాయమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఇటీవల వందేమాతరం, జాతీయ గీతం అంశాలపై వచ్చిన చర్చల నేపథ్యంలో దాఖలైన ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్ర గీతాల ప్రాధాన్యతపై కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.