రాష్ట్ర గీతానికే తొలి ప్రాధాన్యం.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుగా రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను ఆలపించాల్సిందేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర గీతాన్ని పక్కన పెట్టి ఇతర గీతాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశం కేంద్ర హోం శాఖ సర్క్యులర్లో లేదని కోర్టు పేర్కొంది.
చెన్నైకి చెందిన అనన్య రాధాకృష్ణన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను తమిళ రాష్ట్ర గీతంతో ప్రారంభించి, చివరగా జాతీయ గీతంతో ముగించడం తమిళనాడులో చాలా కాలంగా కొనసాగుతున్న సంప్రదాయమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇటీవల వందేమాతరం, జాతీయ గీతం అంశాలపై వచ్చిన చర్చల నేపథ్యంలో దాఖలైన ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్ర గీతాల ప్రాధాన్యతపై కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.