BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

రాష్ట్రంలో 5 వేల ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం భారీ ప్రోత్సాహం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 06:24 AM
79 వీక్షణలు

రాష్ట్రంలో ఆలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం భూసమాచార ఆధారంగా ఆర్థిక సాయం అందించనున్నారు.

10 సెంట్లలోపు స్థలం ఉంటే రూ.20 లక్షలు, 15 సెంట్లు వరకు రూ.30 లక్షలు, 20 సెంట్లు వరకు రూ.40 లక్షలు ఆలయ నిర్మాణానికి మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రామాలయం, శివాలయం లేదా అమ్మవారి ఆలయం ఏది నిర్మించాలనే విషయం స్థానికుల నిర్ణయానికి అనుగుణంగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పరిధిలోని ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ భూములు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో గుర్తించి నిర్మాణాలకు సహకరించనున్నారు.

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000 ఆలయాల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.