BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

రాష్ట్రవ్యాప్తంగా సామాజిక శంఖారావం దళితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. 24న చలో కలెక్టరేట్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:13 AM
13 వీక్షణలు

రాష్ట్రవ్యాప్తంగా సామాజిక శంఖారావం దళితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. 24న చలో కలెక్టరేట్

విజయవాడ,

దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం సామాజిక శంఖారావం చేపట్టినట్లు కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు నాయకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పాదయాత్రలు, బైక్‌ యాత్రలు, బస్సు యాత్రల్లో భాగంగా శుక్రవారం పలు జిల్లాల్లో ప్రజల నుంచి సమస్యలను స్వీకరించారు. ఈ నెల 24న అన్ని జిల్లా కేంద్రాల్లో చలో కలెక్టరేట్‌, ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, దళితవాడల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.

కాకినాడ జిల్లా:

పెద్దాపురం మండలం తాటిపర్తి గ్రామంలోని దళితవాడలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ భవనం నిర్మాణం, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, ఉపాధి హామీ కార్డుల కోసం స్థానికులు తమ సమస్యలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారం కోసం 24న జరిగే కలెక్టరేట్‌ ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.

అనంతపురం జిల్లా:

కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న బస్సు యాత్ర మూడో రోజుకు చేరుకుంది. గుంతకల్లు, విడపనకల్లు, ఉరవకొండ మండలాల్లో నాయకులు పర్యటించి దళితుల సమస్యలను తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాలు, తాగునీరు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రత్యేక స్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో:

ప్రజల నుంచి వ్యక్తిగత అర్జీలు స్వీకరిస్తూ పాదయాత్రలు నిర్వహించారు. ఈ నెల 24న చేపట్టనున్న కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రచారం నిర్వహించారు.

ప్రకాశం జిల్లా:

ఒంగోలు నగరంలోని పలు దళితవాడల్లో కెవిపిఎస్‌, సిఐటియు ఆధ్వర్యంలో బైక్‌ యాత్ర సాగింది. కాలనీల్లో పర్యటించిన నాయకులు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

అనకాపల్లి జిల్లా:

గొలుగొండ మండలం నాగాపురం, పల్లఊరు గ్రామాల్లో దళితవాడలను సందర్శించి సమస్యలను సేకరించారు. కమ్యూనిటీ హాళ్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

విజయనగరం జిల్లా:

గోకపేటలో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలం వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై సంతకాలు సేకరించి కలెక్టరేట్‌ ధర్నాలో అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

తిరుపతి జిల్లా:

ఏర్పేడు మండలంలో కెవిపిఎస్‌, రైతు కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో శంఖారావం సర్వే నిర్వహించారు. దళితవాడల్లో స్మశాన వాటికలు, రహదారులు, డ్రైనేజీ, తాగునీరు వంటి సమస్యలు ఉన్నాయని ప్రజలు తెలిపారు. ఇళ్ల స్థలాలు, సెంటు భూమి లేని కుటుంబాలు ఇంకా ఉన్నాయని, పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవని వివరించారు.

దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 24న జరిగే చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.