BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

రావులపాలెం: పెన్షనర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:42 PM
21 వీక్షణలు

రావులపాలెం: పెన్షనర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

పెన్షనర్స్‌ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన

రావులపాలెం, ఆగస్టు 23:

విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం, గౌరవం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు.

రావులపాలెంలో మండల పెన్షనర్స్‌ భవన నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా ఉద్యోగుల అనుభవం సమాజానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పెన్షనర్లకు గౌరవప్రదమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. భవన నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పెన్షనర్స్‌ సంఘం ప్రతినిధులు, నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.