రాయలసీమలో ‘పసిడి’ పంట..!
కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం తవ్వకాల ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. రూ.405 కోట్ల పెట్టుబడితో జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాయి. దశల వారీగా బంగారం ఉత్పత్తిని పెంచేలా ప్రణాళిక రూపొందించారు. తొలి దశలో ఏడాదికి 400 కిలోల బంగారం, రెండో దశలో 900 కిలోల బంగారం, తుది దశలో 2 టన్నుల బంగారం వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గనుల నుంచి ఉత్పత్తి అయ్యే బంగారం విలువలో 4 శాతం రాయల్టీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అందనుంది. ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు విస్తరణలో భాగంగా రెండో యూనిట్కు కూడా శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపు రానుంది.