BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

రేపాక రఘునందన్‌కు గిడుగు సేవా పురస్కారం కవితా రంగంలో 43 ఏళ్ల సేవలకు గుర్తింపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 03:16 PM
34 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరుకు చెందిన రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి రేపాక రఘునందన్‌కు గిడుగు సేవా పురస్కారం లభించింది.

విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయంలో ఆదివారం మల్లెతీగ సాహితీ మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రఘునందన్‌కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

43 సంవత్సరాలుగా కవితా రంగానికి అందించిన విశిష్ట సేవలకు, ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను తెలుగు, హిందీ భాషల్లో రచించినందుకు, అలాగే భారతదేశంలోనే తొలిసారిగా పైడిమర్రి ముఖచిత్రంతో తపాలా కవరును విడుదల చేయించినందుకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ఇండ్ల రామసుబ్బారెడ్డి, గిడుగు రామమూర్తి ముని మనవడు గిడుగు వేంకట నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ నాటక కళా సమితి వ్యవస్థాపకుడు నన్నపనేని నాగేశ్వరరావు, రచయితలు ఎం. ప్రభాకర్, చిన్ని నారాయణరావు, మల్లెతీగ మాసపత్రిక సంపాదకుడు కలిమి శ్రీ, గ్రంథాలయాధికారిణి కె. రమాదేవి తదితరులు పాల్గొన్నారు.