రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం
రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం
చిలకలూరిపేట: పట్టణంలో శనివారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ కార్యక్రమంనిర్వహించనున్నారు.
ఉదయం 09:30 గంటలకు 38, 6వ వార్డులలో రూ. 23.75 లక్షల నిధులతో నిర్మించిన సి.సి. రోడ్లు, కల్వర్టు పనులను స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పట్టణ టీడీపీ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్ కోరారు.
అనంతరం, ఉదయం 10:00 గంటల నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో "ప్రజా గ్రీవెన్స్" కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల నుండి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా స్వీకరిస్తారని, దరఖాస్తులు లేనివారు అక్కడికక్కడే రాసి ఇవ్వవచ్చని టీడీపీ నియోజకవర్గ కార్యాలయం తెలిపింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.