BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

Ration Cards: రేషన్ కార్డుల విభజన సులభతరం చేయాలి.. అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 02:07 PM
79 వీక్షణలు

అమరావతి | NTODAY NEWS

రేషన్ కార్డుల విభజన ప్రక్రియను మరింత సులభతరం చేసి ప్రజలకు వేగంగా సేవలు అందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ (RTGS) వ్యవస్థపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడానికి చేపట్టిన డేటా లేక్ పనులను జూలై నెలలోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ వ్యవస్థ ద్వారా వివిధ ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా అందించవచ్చని పేర్కొన్నారు.

అదేవిధంగా కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించి, ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అభ్యర్థుల ఆధార్ నంబర్ ఆధారంగా అవసరమైన ధృవీకరణ పత్రాలన్నీ డిజిటల్ విధానంలో స్వయంచాలకంగా ధృవీకరించే వ్యవస్థను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా, సులభంగా అందించేందుకు సాంకేతికతను సమర్థంగా వినియోగించాలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.