BREAKING
Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి
www.ntodaynews.com

Ration Cards: రేషన్ కార్డుల విభజన సులభతరం చేయాలి.. అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 02:07 PM
31 వీక్షణలు

అమరావతి | NTODAY NEWS

రేషన్ కార్డుల విభజన ప్రక్రియను మరింత సులభతరం చేసి ప్రజలకు వేగంగా సేవలు అందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ (RTGS) వ్యవస్థపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడానికి చేపట్టిన డేటా లేక్ పనులను జూలై నెలలోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ వ్యవస్థ ద్వారా వివిధ ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా అందించవచ్చని పేర్కొన్నారు.

అదేవిధంగా కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించి, ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అభ్యర్థుల ఆధార్ నంబర్ ఆధారంగా అవసరమైన ధృవీకరణ పత్రాలన్నీ డిజిటల్ విధానంలో స్వయంచాలకంగా ధృవీకరించే వ్యవస్థను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా, సులభంగా అందించేందుకు సాంకేతికతను సమర్థంగా వినియోగించాలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.