www.ntodaynews.com
రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు వేగం పెంచిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్
రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు వేగం పెంచిన పోలీసులు
పల్నాడు జిల్లాలో కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెంటచింతల మండలానికి చెందిన ఓ వివాహితపై విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో లైంగిక దాడి జరిగినట్లు సమాచారం.
జీవనోపాధి కోసం విశాఖలో నివసిస్తున్న బాధితురాలు ఈ నెల 26న నడికుడి వైపు ప్రయాణిస్తుండగా, జనరల్ బోగీలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఆమెను మోసం చేసి ఏసీ బోగీకి తీసుకెళ్లి దాడికి పాల్పడినట్లు తెలిసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. రైలులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, ప్రయాణికుల వివరాలు సేకరిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోందని సంబంధిత అధికారులు తెలిపారు.