రైతన్నల కోసం.. రైతు ముందడుగు
రైతన్నల కోసం.. రైతు ముందడుగు
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రహదారి సమస్యకు పరిష్కారం
నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న చిన్నకాపర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నెలకొన్న రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో, స్థానిక సర్పంచ్ మరియు ఒక రైతు చొరవతో ఈ సమస్య కొలిక్కి వచ్చింది. కొనుగోలు కేంద్రం పక్కనే భూమి కలిగిన రైతు ముక్కామల్ల యాదయ్య లారీలు మరియు ట్రాక్టర్ల రాకపోకలకు వీలుగా తన భూమి గుండా దారి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు రహదారి విస్తరణలో భాగంగా అడ్డుగా ఉన్న తాటి చెట్లను జేసీబీ సహాయంతో తొలగించారు.
పర్యవేక్షణ: సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ మరియు రైతు యాదయ్య స్వయంగా దగ్గరుండి పనులను పూర్తి చేయించారు. ఈ పనులతో ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకపోకలు సులభం అయ్యాయి ఈ కార్యక్రమంలో చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, ప్రజాప్రతినిధులు స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.