రంగాపూర్లో 95 శాతం రైతు కార్డు నమోదు పూర్తి
మిగిలిన రైతులు కూడా వెంటనే నమోదు చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి సూచన
బీబీనగర్ | Ntoday News
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో రైతు కార్డు (Farmer Card) అవగాహన, నమోదు కార్యక్రమం నిర్వహించారు. గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో రైతులకు రైతు కార్డుకు సంబంధించిన వివరాలను వివరించారు.
ఈ సందర్భంగా గ్రామంలో రైతు కార్డు నమోదు ప్రక్రియ 95 శాతం పూర్తయినట్లు వ్యవసాయ విస్తరణ అధికారి తెలిపారు. ఇంకా నమోదు చేసుకోని మిగిలిన 5 శాతం మంది రైతులు కూడా వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
రైతు కార్డు నమోదు ద్వారా ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సంబంధిత ప్రయోజనాలను అర్హులైన రైతులు సులభంగా పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి రైతు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.