రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి.
పోచంపల్లి మండలంలోని రేవనపల్లి, గోస్కొండ, భీమనపల్లి గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాలకు నెల రోజులు అవుతున్న ఇప్పటివరకు కాంట చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.
తూకం పేరిట 42 కిలోలు ధాన్యం బస్తాన్ని ధాన్యం కాంట వేస్తూ రైతుల కష్టాన్ని రైస్ మిల్లులు యాజమాన్యాలు దోచుకుంటున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూస్తుందని ఆయన తెలిపారు. లారీలు కాంటా పేరిట బస్తకు రూపాయి వస్తువులు చేస్తున్న సివిల్ సప్లై అధికారులు ఇప్పటివరకు వారి విషయంలో జోక్యం చేసుకోకుండా కొనసాగించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏర్పడ్డ లారీల సమస్యతో పాటు రైస్ మిల్లుల యాజమాన్యం వైఖరిని మార్చి వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేపట్టకపోతే టిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమస్యలను వివరించి రైతుల పక్షాన పోరాడేందుకు కేసిఆర్, కేటీఆర్ నాయకత్వంలో హైవేని దిగ్బంధం చేయడానికి బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు.