www.ntodaynews.com
బస్సు ఢీకొని 21 నెలల చిన్నారి మృతి
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
రామన్నపేట
బస్సు ఢీకొని 21 నెలల చిన్నారి మృతి
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో 21 నెలల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన రామన్నపేట మండలం తుమ్మలగూడెం (ఇంద్రపాలనగరం) గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో గ్రామానికి చెందిన ఈర్లపల్లి మురళి తన పెద్ద కుమార్తె ఈర్లపల్లి శ్రేష్ఠజ్ఞ మాన్సినిని బస్సు ఎక్కించేందుకు తీసుకువచ్చారు. అదే సమయంలో ఆయన 21 నెలల చిన్న కుమార్తె ఈర్లపల్లి అభిజ్ఞతార కూడా బస్సు సమీపానికి వచ్చింది. ఆ సమయంలో బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో చిన్నారిని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బస్సు చిన్నారిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రామన్నపేట ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు...