BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

రైతులకు శుభవార్త మే 26న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 09:44 PM
86 వీక్షణలు

దేశవ్యాప్తంగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) ఊరటనిచ్చే వార్త చెప్పింది. దేశ వ్యవసాయానికి ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది మే 26న కేరళ తీరాన్ని తాకే అవకాశముందని ఐఎండీ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న కేరళలోకి ప్రవేశించే రుతుపవనాలు ఈసారి ఐదు రోజుల ముందుగానే రానుండటం విశేషం.

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రుతుపవనాల ముందస్తు రాకకు అవకాశాలు మెరుగయ్యాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే అండమాన్ సముద్ర ప్రాంతంలో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయని, మరో 48 గంటల్లో అక్కడికి నైరుతి రుతుపవనాలు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.

భారత వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకం. దేశంలో 50 శాతానికి పైగా సాగుభూమి ఇప్పటికీ వర్షాధారంగానే సాగు అవుతోంది. మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో సుమారు 40 శాతం దిగుబడి ఈ వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల రుతుపవనాల సమయానుకూల రాక రైతులకు ఆశాజనకంగా మారింది.

ముఖ్యంగా ఖరీఫ్ పంటల సాగుకు ఇది ఊతమివ్వనుంది. వర్షాలు సకాలంలో కురిస్తే వరి, పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.