BREAKING
మనమిత్ర వాట్సాప్ ద్వారా భక్తులకు మరిన్ని సేవలు తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు ఇంధన ధరల పెంపును రాజకీయంగా వాడుకుంటున్న పార్టీలు: కిషన్ రెడ్డి రైతులకు శుభవార్త మే 26న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు తమిళనాడు సీఎం విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన చిరంజీవి బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గాజుల ముఖేష్ గౌడ్ మిల్లింగ్ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి--జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జర్నలిజం విలువలు కాపాడాలి… సమాజాన్ని మార్చే శక్తిగా మీడియా నిలవాలి ప్రజలకు తాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలి --జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు తోటపల్లిలో 11/33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు నేడు శంకుస్థాపన మనమిత్ర వాట్సాప్ ద్వారా భక్తులకు మరిన్ని సేవలు తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు ఇంధన ధరల పెంపును రాజకీయంగా వాడుకుంటున్న పార్టీలు: కిషన్ రెడ్డి రైతులకు శుభవార్త మే 26న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు తమిళనాడు సీఎం విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన చిరంజీవి బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గాజుల ముఖేష్ గౌడ్ మిల్లింగ్ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి--జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జర్నలిజం విలువలు కాపాడాలి… సమాజాన్ని మార్చే శక్తిగా మీడియా నిలవాలి ప్రజలకు తాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలి --జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు తోటపల్లిలో 11/33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు నేడు శంకుస్థాపన
www.ntodaynews.com

రైతులకు శుభవార్త మే 26న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 09:44 PM
10 వీక్షణలు

దేశవ్యాప్తంగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) ఊరటనిచ్చే వార్త చెప్పింది. దేశ వ్యవసాయానికి ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది మే 26న కేరళ తీరాన్ని తాకే అవకాశముందని ఐఎండీ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న కేరళలోకి ప్రవేశించే రుతుపవనాలు ఈసారి ఐదు రోజుల ముందుగానే రానుండటం విశేషం.

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రుతుపవనాల ముందస్తు రాకకు అవకాశాలు మెరుగయ్యాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే అండమాన్ సముద్ర ప్రాంతంలో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయని, మరో 48 గంటల్లో అక్కడికి నైరుతి రుతుపవనాలు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.

భారత వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకం. దేశంలో 50 శాతానికి పైగా సాగుభూమి ఇప్పటికీ వర్షాధారంగానే సాగు అవుతోంది. మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో సుమారు 40 శాతం దిగుబడి ఈ వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల రుతుపవనాల సమయానుకూల రాక రైతులకు ఆశాజనకంగా మారింది.

ముఖ్యంగా ఖరీఫ్ పంటల సాగుకు ఇది ఊతమివ్వనుంది. వర్షాలు సకాలంలో కురిస్తే వరి, పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.