BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

రైతులకు శుభవార్త మే 26న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 09:44 PM
131 వీక్షణలు

దేశవ్యాప్తంగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) ఊరటనిచ్చే వార్త చెప్పింది. దేశ వ్యవసాయానికి ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది మే 26న కేరళ తీరాన్ని తాకే అవకాశముందని ఐఎండీ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న కేరళలోకి ప్రవేశించే రుతుపవనాలు ఈసారి ఐదు రోజుల ముందుగానే రానుండటం విశేషం.

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రుతుపవనాల ముందస్తు రాకకు అవకాశాలు మెరుగయ్యాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే అండమాన్ సముద్ర ప్రాంతంలో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయని, మరో 48 గంటల్లో అక్కడికి నైరుతి రుతుపవనాలు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.

భారత వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకం. దేశంలో 50 శాతానికి పైగా సాగుభూమి ఇప్పటికీ వర్షాధారంగానే సాగు అవుతోంది. మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో సుమారు 40 శాతం దిగుబడి ఈ వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల రుతుపవనాల సమయానుకూల రాక రైతులకు ఆశాజనకంగా మారింది.

ముఖ్యంగా ఖరీఫ్ పంటల సాగుకు ఇది ఊతమివ్వనుంది. వర్షాలు సకాలంలో కురిస్తే వరి, పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.