www.ntodaynews.com
రైతులు అపోహలు, వదంతులు నమ్మవద్దు: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
రాజకీయ ప్రేరేపిత అసత్య ఆరోపణలను తోసిపుచ్చిన కలెక్టర్
వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ
మంచిర్యాల :వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు చేస్తున్న అసత్య ఆరోపణలను, అపోహలను మరియు వదంతులను రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా అధికార యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని, అన్నదాతలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని కలెక్టర్ భరోసా ఇచ్చారు