BREAKING
​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం
www.ntodaynews.com

రెండు రోజుల్లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 11:39 AM
22 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు త్వరలో శుభవార్త రానుంది.

ఇంటర్మీడియట్ విద్యామండలి సమాచారం ప్రకారం ఈ ఫలితాలు జూన్ 18న విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి సుమారు 12.50 లక్షల జవాబు పత్రాలు పరిశీలించగా, జూన్ 15తో మూల్యాంకనం ముగిసింది. ప్రస్తుతం ఫలితాల ప్రాసెసింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 5 వరకు నిర్వహించగా, ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి 11 వరకు జిల్లా కేంద్రాల్లో జరిగాయి. అన్ని ప్రక్రియలు పూర్తవడంతో నిర్ణయించిన తేదీకే ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది తొలిసారిగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు అవకాశం ఇవ్వడంతో దాదాపు 1.50 లక్షల మంది హాజరయ్యారు. మార్కులు మెరుగుపరుచుకునేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం విశేషం.

ఇంటర్ ఫలితాల విడుదల అనంతరం ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈఏపీసెట్ ర్యాంకులలో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో, ఇంటర్ ఫలితాల తర్వాతే వాటిని విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోగలరు.