BREAKING
జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు
www.ntodaynews.com

రెండు రోజుల్లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 11:39 AM
65 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు త్వరలో శుభవార్త రానుంది.

ఇంటర్మీడియట్ విద్యామండలి సమాచారం ప్రకారం ఈ ఫలితాలు జూన్ 18న విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి సుమారు 12.50 లక్షల జవాబు పత్రాలు పరిశీలించగా, జూన్ 15తో మూల్యాంకనం ముగిసింది. ప్రస్తుతం ఫలితాల ప్రాసెసింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 5 వరకు నిర్వహించగా, ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి 11 వరకు జిల్లా కేంద్రాల్లో జరిగాయి. అన్ని ప్రక్రియలు పూర్తవడంతో నిర్ణయించిన తేదీకే ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది తొలిసారిగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు అవకాశం ఇవ్వడంతో దాదాపు 1.50 లక్షల మంది హాజరయ్యారు. మార్కులు మెరుగుపరుచుకునేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం విశేషం.

ఇంటర్ ఫలితాల విడుదల అనంతరం ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈఏపీసెట్ ర్యాంకులలో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో, ఇంటర్ ఫలితాల తర్వాతే వాటిని విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోగలరు.