BREAKING
ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

రహదారి ఆక్రమణలపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ సీరియస్

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
25 Apr, 2026 - 11:59 PM
35 వీక్షణలు

రహదారి ఆక్రమణలపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ సీరియస్ .... తక్షణమే తొలగించాలని కమిషనర్‌కు ఆదేశం

నంద్యాల,

నంద్యాల పట్టణంలోని ప్రధాన కూడలి అయిన శ్రీనివాస్ సెంటర్ సమీపంలో ఉన్న ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ పక్కన ఉన్న సందు ఆక్రమణకు గురికావడంపై రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీవ్రంగా స్పందించారు. స్థానికంగా ఉన్న ఈ కీలకమైన సందును కొందరు వ్యక్తులు ఆక్రమించి, మూసివేయడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన మంత్రి ఫరూక్ శనివారం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. సందు మూసివేత వల్ల రాకపోకలకు కలుగుతున్న అంతరాయాన్ని పరిశీలించిన ఆయన, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్  నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న గారిని సంఘటన స్థలానికి పిలిపించి మాట్లాడి, సందును ఆక్రమణలను తక్షణమే తొలగించాలి. మూసివేసిన మార్గాన్ని వెంటనే తెరిపించి, సాధారణ ప్రజల ఉపయోగంలోకి తీసుకురావాలిని తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, సందులు ఆక్రమణలకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల సౌకర్యార్థం ఉన్న దారులను ఆక్రమించడం చట్టవిరుద్ధమని, మున్సిపల్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.