BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

రమణక్కపేటలో ఘనంగా 140వ మేడే వేడుకలు – అమరవీరులకు ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 04:37 PM
83 వీక్షణలు

రమణక్కపేటలో ఘనంగా 140వ మేడే వేడుకలు – అమరవీరులకు ఘన నివాళులు

రమణక్కపేట (మే 1, 2026): ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో 140వ మేడే వేడుకలు పల్లె పాము భవాని అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులకు మిఠాయిలు పంచుతూ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా వాటికి మద్దతు ఇవ్వడం ఆందోళనకరమని పేర్కొన్నారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పని దినాలు అమలు చేయాలని, పాఠశాలల్లో స్పాట్ కిచెన్ సెంటర్లు రద్దు చేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదని, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలని, కార్మికులకు నెలకు రూ.36 వేల జీతం ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి శాశ్వతీకరణ చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని, వి బి రామ్ జి పథకాన్ని రద్దు చేయాలని, 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజుకు రూ.600 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరవీరులు పోరాడి సాధించిన హక్కులు, ఆశయాలను కాపాడుకోవడమే వారికి నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లెపాము భవాని, ఆముదాల సురేషు, ఆముదాల మహేశ్వరరావు, నందిపామరాణి, వేముల మహాలక్ష్మి, వేముల చంటి, ఆముదాల చిన్నబాబు, దార బేబీ శాలిని, ఉయ్యూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.