BREAKING
సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు
www.ntodaynews.com

రమణక్కపేటలో ఘనంగా 140వ మేడే వేడుకలు – అమరవీరులకు ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 04:37 PM
162 వీక్షణలు

రమణక్కపేటలో ఘనంగా 140వ మేడే వేడుకలు – అమరవీరులకు ఘన నివాళులు

రమణక్కపేట (మే 1, 2026): ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో 140వ మేడే వేడుకలు పల్లె పాము భవాని అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులకు మిఠాయిలు పంచుతూ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా వాటికి మద్దతు ఇవ్వడం ఆందోళనకరమని పేర్కొన్నారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పని దినాలు అమలు చేయాలని, పాఠశాలల్లో స్పాట్ కిచెన్ సెంటర్లు రద్దు చేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదని, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలని, కార్మికులకు నెలకు రూ.36 వేల జీతం ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి శాశ్వతీకరణ చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని, వి బి రామ్ జి పథకాన్ని రద్దు చేయాలని, 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజుకు రూ.600 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరవీరులు పోరాడి సాధించిన హక్కులు, ఆశయాలను కాపాడుకోవడమే వారికి నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లెపాము భవాని, ఆముదాల సురేషు, ఆముదాల మహేశ్వరరావు, నందిపామరాణి, వేముల మహాలక్ష్మి, వేముల చంటి, ఆముదాల చిన్నబాబు, దార బేబీ శాలిని, ఉయ్యూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.