BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

రూ.2 లక్షలు పలికిన కచిడి చేప.. అంతర్వేది హార్బర్‌లో మత్స్యకారులకు భారీ లాభం

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:12 PM
84 వీక్షణలు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల వలకు అరుదైన కచిడి చేప (ఘోల్ ఫిష్) చిక్కింది. సుమారు 25 కిలోల బరువున్న ఈ మగ చేపను చూసేందుకు హార్బర్ వద్ద ఆసక్తికర వాతావరణం నెలకొంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఈ చేపను వేలంలో పాలకొల్లుకు చెందిన ఓ వ్యాపారి రూ.2 లక్షలకు కొనుగోలు చేశాడు. దీంతో మత్స్యకారులకు భారీ ఆదాయం లభించింది.

కచిడి చేపను "సముద్రపు బంగారం"గా పిలుస్తారు. ఈ చేపలోని ఎయిర్ బ్లాడర్‌కు ఔషధ పరిశ్రమతో పాటు శస్త్రచికిత్సల్లో ఉపయోగించే ప్రత్యేక దారాల తయారీలో అధిక డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ చేపలకు మార్కెట్‌లో భారీ ధర లభిస్తుంది.

25 కిలోల బరువున్న చేప రూ.2 లక్షలకు అమ్ముడవడంతో కిలో ధర సుమారు రూ.8 వేలుగా నమోదైంది. అరుదుగా లభించే ఈ చేప మత్స్యకారుల అదృష్టాన్ని మార్చిందని స్థానికులు చెబుతున్నారు.