www.ntodaynews.com
రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి
తెలంగాణ
/
నల్గొండ
/
నార్కెట్ పల్లి
రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి
నల్గొండ జిల్లా నార్కట్పల్లి గ్రామ శివారులోని ఓల్డ్ వివర్ హోటల్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ వడ్లపాటి శాంతి స్వరూప్ (26) మృతి చెందాడు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామానికి చెందిన శాంతి స్వరూప్.. పత్తిపాడు నుంచి హైదరాబాద్కు సరివి కర్రల లోడ్తో డీసీఎం వాహనంలో వెళ్తుండగా ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతుడి తండ్రి వడ్లపాటి చిన్న ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి ఎస్ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.