www.ntodaynews.com
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శంకర్ కుటుంబానికి రూ.70 వేల ఆర్థిక సాయం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
కాంగ్రెస్ నాయకులు, లారీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో బాధితులకు అండ
మంచిర్యాల: నస్పూర్ తీగలపహాడ్ గోదాం వద్ద ధాన్యం లోడుతో వచ్చిన వాహనంపై శనివారం రాత్రి నిద్రిస్తూ, ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన గుడిహత్నూర్ వాసి శంకర్ కుటుంబానికి రూ.70 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ ప్రమాద ఘటనపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, ఆయన ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ నాయకులు మృతుని కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు; అదేవిధంగా మంచిర్యాల, శ్రీరాంపూర్ లారీ అసోసియేషన్ల తరపున మానవత్వంతో మరో రూ.20 వేల సహాయాన్ని అందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు