BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

రోడ్డును కమ్మేస్తున్న పిచ్చి చెట్లు.. చీకటి పడితే ప్రయాణికుల్లో భయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 05:43 PM
26 వీక్షణలు

రోడ్డును కమ్మేస్తున్న పిచ్చి చెట్లు.. చీకటి పడితే ప్రయాణికుల్లో భయం

లింగపాలెం/ములగలంపాడు, ఆగస్టు 21:

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ములగలంపాడు గ్రామం కాపుల బజారులో రహదారి పిచ్చి చెట్లతో నిండిపోయి అడవిని తలపిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత ఈ మార్గంలో ప్రయాణించాలంటే భయంతో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.

ఈ రహదారిపై ప్రతిరోజూ సుమారు 200 మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుండగా, 50 వరకు వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అయితే రోడ్డును కమ్మేస్తున్న చెట్ల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

అంతేకాకుండా సిమెంట్ రోడ్డులోని పగుళ్లలో పిచ్చి మొక్కలు పెరగడంతో రోడ్డు దెబ్బతింటోందని స్థానికులు తెలిపారు. మొక్కల వేర్లు విస్తరించి కాంక్రీటు పగుళ్లు పెరగడం, వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల రహదారి త్వరగా పాడయ్యే ప్రమాదం ఉందన్నారు.

పిచ్చి చెట్ల పొదల్లో దోమలు, తేళ్లు, పాములు వంటి విషపూరిత జీవులు చేరే అవకాశం ఉందని, రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు పరిస్థితిని అధికారులు వెంటనే పరిశీలించి, పెరిగిపోయిన పిచ్చి మొక్కలు తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ములగలంపాడు గ్రామస్థులు కోరుతున్నారు.