www.ntodaynews.com
సహాయ పరికరాలు పంపిణి వెంటనే చేయాలి
తెలంగాణ
జిల్లాలో ఎంపిక అయిన వికలాంగుల లబ్ధిదారులకు సహాయ పరికరాలు పంపిణి వెంటనే చేయాలి-- వనం ఉపేందర్, ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి
N TODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం
జిల్లాలో ఎంపిక అయిన వికలాంగుల లబ్ధిదారులకు సహాయ పరికరాల పంపిణీ వెంటనే ఏర్పాటు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ పరిపాలనాధికారి జగన్మోహన్ కు బుధవారం రోజున ఎన్ పి ఆర్ డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు స్వరూపంగా ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక అయిన వికలాంగుల లబ్ధిదారులకు సహాయ పరికరాలు వెంటనే పంపిణి చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి డిమాండ్ చేస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఉచితంగా సహాయ పరికరాలు పంపిణి చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక కోసం 6 జూన్ 2025 నాడు టీవీసీసీ/సి1/119/2024 పేరుతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు ప్రభుత్వ నిర్ణయంతో పరికరాల కోసం వేలాదిమంది వికలాంగులు దరఖాస్తులు చేసుకున్నారు అని అన్నారు 7920 మంది లబ్ధిదారులకు 16 రకాల సహాయ పరికరాలు పంపిణి చేయడానికి జిల్లా స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక జరిగి నెలలు గడుస్తున్న నేటికీ పంపిణికి నోచుకోలేదని అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మకంగా పరికరాల పంపిణి కోసం 50 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.సహాయ పరికరాల కోసం ఎంపిక అయిన లబ్ధిదారులు పరికరాల కోసం ఎదురుచూస్తున్నారు అని తక్షణమే సహాయ పరికరాలను పంపిణి చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి యాదాద్రి భువన జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ పిఆర్ డి జిల్లా కోశాధికారి కొత్త లలిత,భువనగిరి టౌన్ అధ్యక్షులు ఎషాల గోపి తదితరులు పాల్గొన్నారు
Follow us on
Website
Facebook
Instagram
YouTube