www.ntodaynews.com
చిట్యాలలో రోడ్డు ప్రమాదం:
తెలంగాణ
చిట్యాలలో రోడ్డు ప్రమాదం: ఇద్దరికీ తీవ్ర గాయాలు, తక్షణ చికిత్సకు మంత్రి ఆదేశాలు
NTODAY NEWS: చిట్యాల, నల్గొండ జిల్లా
చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల ప్రాథమిక సమాచారం ప్రకారం, శాలిగౌరారం మండలం బైరోనిబండకు చెందిన రమేష్ టిఫిన్ అనంతరం రోడ్డు దాటుతుండగా, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకట్ ద్విచక్రవాహనంపై హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్నాడు. ఈ సమయంలో బైక్ రమేష్ను ఢీకొట్టడంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రమాదాన్ని గమనించి తన కాన్వాయ్ను ఆపించారు. క్షతగాత్రులను ఆలస్యం చేయకుండా అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించాలని అధికారులకు ఆదేశించారు. వైద్యులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చికిత్స అందించాలని సూచించారు.
ప్రమాదంపై పూర్తి వివరాలు సేకరించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
#RoadAccident #Chityal #NalgondaDistrict #TelanganaNews #PublicSafety
Follow us on
Website
Facebook
Instagram
YouTube