www.ntodaynews.com
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
తెలంగాణ
రామన్నపేటలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
NTODAY NEWS: రామన్నపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో రామన్నపేట పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులు, ట్రాక్టర్ యజమానులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రోడ్డు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా సీటుబెల్టు ధరించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి వాహనం నడపాలని అన్నారు.
ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ ఉపయోగించడం, మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, మరికొందరు శాశ్వత వికలాంగులుగా మారుతున్నారని పేర్కొంటూ, రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రామన్నపేట ఎస్సై డి. నాగరాజు, పోలీస్ సిబ్బంది, వాహనదారులు, స్థానిక డ్రైవర్లు పాల్గొన్నారు.
#RoadSafety
#TrafficAwareness
#HelmetSafety
#SeatBeltAwareness
#SafeDriving
#RoadSafetyCampaign
#TrafficRules
#PublicAwareness
#YadadriBhuvanagiri
#Ramannapet
Follow us on
Website
Facebook
Instagram
YouTube