BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఆర్టిఐ కమిషనర్

తెలంగాణ
23 Jun, 2025 - 07:43 PM
142 వీక్షణలు
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఆర్టిఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి NTODAY NEWS:యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి సోమవారం రోజున దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా గర్భగుడిలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. మొదట స్వామివారి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వచ్చిన కమిషనర్ కు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆర్డిఓ, తాహసిల్దార్ మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఆలయ స్వాగతం పలికి స్వామి వారి దర్శనం కల్పించారు. ఆశీర్వచన మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఏఈవో గజవెల్లి రమేశ్ బాబు, సూపరింటెండెంట్ రాజన్ బాబు లడ్డూ ప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫొటోను బహూకరించారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి యాదగిరి గుట్టలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పీఆర్వో దుడుక రామకృష్ణను ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి పరామర్శించారు. రోడ్డు ప్రమాద సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఐజేయూ జాతీయ కమిటీ సభ్యుడు కందుల శ్రీనివాసరావు, తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్ గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు. Follow us on Website Facebook Instagram YouTube